అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీవన్దాన్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. బ్రెయిన్డెడ్ బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి అవయవదానం ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. ఇప్పటికే పలువురికి అవయవాలను అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగాం. అయితే చివరి నిమిషంలో కొందరు కుటుంబాలు వెనక్కి తగ్గడం వల్ల అవకాశాలు కోల్పోతున్నాం. ప్రభుత్వం అవయవదానం చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మరింత మంది ముందుకు వచ్చి అవయవదానానికి సహకరిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ మన్మథరావు,
జీవన్ దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్


