ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు అవార్డు

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు 2025 సంవత్సరానికి ఉత్తమ పాలిటెక్నిక్‌ అవార్డు శుక్రవారం అందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎస్‌టీఈ ఆంధ్రప్రదేశ్‌ సెక్షన్‌ ప్రకటించిన ఈ అవార్డును అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కేవీ రమణకు అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌టీఈ ఆంధ్రప్రదేశ్‌ సెక్షన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.రంగ జనార్ధన్‌, కార్యదర్శి ప్రొఫసర్‌ బి.ఈశ్వర్‌రెడ్డి, ఏఐటీఏఎం చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు, డైరెక్టర్‌ కె.మధుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement