Tahsildar Murder Case: నిందితుల కోసం ముమ్మర గాలింపు | - | Sakshi
Sakshi News home page

Tahsildar Murder Case: నిందితుల కోసం ముమ్మర గాలింపు

Feb 5 2024 12:46 AM | Updated on Feb 5 2024 8:46 AM

- - Sakshi

పీఎంపాలెం: నగరంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్‌ రమణయ్య హత్యకేసు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హత్య చేసిన తరువాత నిందితుడి విమానంలో బెంగళూరు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రెండు పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు తెలిసింది. హత్యా సంఘటనలో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న మధురవాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు అర్చకులను ఇప్పటికే పోలీసులు విచారించారు.

హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే నిందితుల కోసం పది పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement