తాండూరు ఆర్డీఓ అనిత
జిల్లా వ్యవసాయాధికారి కవిత
అనంతగిరి: వానాకాలం సీజన్ – 2026లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి వంగడాలు సాగు చేస్తున్న రైతులు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కవిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే, సంబంధిత డీలర్లు రైతు పేరు, విత్తన రకం వంటి వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేస్తారని తెలిపారు. సొంత విత్తనం నాటిన రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. వివరాల నమోదుకు సెప్టెంబర్ 10వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం సినీ హీరో నాగచైతన్య వచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్యాలయం సందడిగా మారింది. అభిమాన హీరోను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
సెక్రటరీ రాధిక
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శిశు గృహాన్ని బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ రాధిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వసతలుపై ఆరా తీశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. సమయానుకూలంగా, క్రమం తప్పకుండా ఆహారం అందించాలని తెలిపారు.
కేసుల వారీగా సమీక్ష
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహమెహ్ర కోర్టు డ్యూటీ అధికారులతో కేసుల వారీగా సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్ దాఖలు, కోర్టు విచారణలో ఎదుర య్యే సమస్యలు, పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా, పబ్లిక్ ప్రాస్యికూటర్ అన్వేష్, లీగల్ అడ్వయిజర్ అనిల్కుమార్, డీఎస్పీలు, సీఐలు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.


