ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

తిరుపతి రూరల్‌ : ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో పునర్‌వ్యవస్థీకరణ విద్యుత్‌ పంపిణీ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. సంస్థ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల పురోగతిపై గురువారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సంస్థ కన్‌స్ట్రక్షన్‌ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే ధ్యేయంగా ఆర్‌డీ ఎస్‌ఎస్‌ పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను, 11 కేవీ ఫీడర్లను వేరు చేయడం, ఓవర్‌ లోడ్‌ సమస్యను అధిగమించేందుకు వీలుగా అదనంగా 33 కేవీ ఫీడర్ల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా, నాణ్యమైన 3 ఫేజ్‌ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన పనులను చేపడుతున్నామన్నారు. అలాగే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం పూర్తి అయితే రైతులకు మరింత మెరుగ్గా పగటిపూట 9 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ ఖాన్‌, కే. గురవయ్య, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జె. రమణాదేవి, జనరల్‌ మేనేజర్లు రామచంద్రరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement