తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ (తుడా) సెక్రటరీగా డాక్టర్ ఎన్వీ శ్రీకాంత్ బాబును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీకాళహస్తి ప్రాంతీయ పశువుల ఆస్పత్రిలో సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ బాబుని డిప్యుటేషన్పై తుడా సెక్రటరీగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమల:తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,477 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది.
తుడా సెక్రటరీగా శ్రీకాంత్ బాబు


