తిరుమలలో పాముల కలకలం | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో పాముల కలకలం

Apr 25 2023 12:48 AM | Updated on Apr 25 2023 12:48 AM

- - Sakshi

తిరుమల : తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పాములు కలకలం సృష్టించిన సంఘటన సోమవా రం చోటుచేసుకుంది. టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కర్‌ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక గాలిగోపురం సమీపంలోని మెట్లదారిపై ఓ నాగుపాము వచ్చినట్లు దుకాణదారులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం స్థానిక ఫిల్టర్‌ హౌస్‌ వద్ద మరో పాము వచ్చినట్లు సిబ్బంది తెలపడంతో అక్కడికి చేరుకుని ఏడు అడుగుల జెర్రిపోతును పట్టుకున్నారు. అనంతరం వాటిని అవ్వాచ్చారి కోనలో విడిచిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement