సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు హైదరాబాద్కు బయలుదేరారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో సుమారు రెండు గంటల పాటు వైఎస్ జగన్ ఉండనున్నారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో జలవిహార్లోని గ్రాండ్ లాన్స్కు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అక్కడ ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు వివాహ వేడుకలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. వివాహ కార్యక్రమం అనంతరం జలవిహార్ నుంచి తిరిగి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరుతారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ విమానాశ్రయం, జలవిహార్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వైఎస్ జగన్ రాక, వెళ్లే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


