యువకుడి కిడ్నాప్‌.. బలవంతంగా పెళ్లి

Young Man Kidnapped And Forcibly Married - Sakshi

చైతన్యపురి: కండిషన్‌ బెయిల్‌కు కోసం సంతకం పెట్టేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వెళుతున్న యువకుడిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి జరిపించిన ఘటన ఆదివారం చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్‌నకు చెందిన ననావత్‌ వెంకటేష్‌ నాయక్‌ (26)  కొన్నాళ్ల క్రితం ఓ యువతిని వేధించిన కేసులో  జై లుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. కండిషన్‌ బెయిల్‌ ఉండటంతో ఆదివారం ఉదయం సంతకం చేసేందుకు సరూర్‌నగర్‌  పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. కారులో వచ్చిన తన స్నేహితుడు విజయ్‌ను వేచి ఉండాలంటూ స్టేషన్‌లోకి వెళ్లాడు.

 వీరు తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తాలో గుర్తు తెలి యని వ్యక్తులు వెంకటేష్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లారు. ఇదే విషయాన్ని వెంకటేశ్‌ స్నేహితుడు విజయ్‌ అతని సోదరుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. వెంకటేష్‌ను  సింగరేణి కాలనీకి తీసుకెళ్లి అక్కడ దేవాలయంలో  వారు  గతంలో తనపై కేసు పెట్టిన యువతి దివ్యతో వివాహం జరిపించారు.  అక్కడకు వెళ్లిన విజయ్‌కుమార్‌ ఈ విషయంపై చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అనంతరం వెంకటేశ్‌ ను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. తనపై కేసు పెట్టిన యువతి కుటుంబానికి చెందిన వారు తనను బలవవంతంగా తీసుకెళ్లి ఆమెతో వివాహం చేశారని పోలీసులకు చెప్పాడు.  గజానాయక్, నిరంజన్‌ నాయక్, ఆర్‌.గోపా ల్‌ మరికొందరిపై ఫిర్యాదు చేశాడు. నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.  

(చదవండి: పెళ్లికి అంగీకరించలేదని... ఒంటిపై డీజిల్‌ పోసుకుని..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top