శ్రీ కృష్ణుడి రూప ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు నో!

TS High Court Unveiling Of NTR Statue Khammam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదు­పరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు.  తానా ఈ విగ్ర­హాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును సవాల్‌ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి.

(చదవండి: ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top