మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్‌ మేటి | Times Mega Property Expo 2023: Your Gateway to Real Estate Excellence in Hyderabad | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్‌ మేటి

Sep 10 2023 2:24 AM | Updated on Sep 10 2023 2:24 AM

Times Mega Property Expo 2023: Your Gateway to Real Estate Excellence in Hyderabad - Sakshi

ఎక్స్‌పో’లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌  తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నా రు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్‌ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్‌ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్‌ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు.

ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్‌ నగరంగా హైదరాబాద్‌ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్‌ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్‌ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్‌ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్‌ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్‌ హెడ్‌ కమల్‌ క్రిష్ణన్‌ మాట్లాడుతూ, టైమ్స్‌ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement