బిల్డర్‌ను మోసం చేసిన ముగ్గురు మహిళలు | three women booked for alleged fake will deed fraud in hyderabad | Sakshi
Sakshi News home page

బిల్డర్‌ను మోసం చేసిన ముగ్గురు మహిళలు

Jun 22 2026 10:10 AM | Updated on Jun 22 2026 10:12 AM

three women booked for alleged fake will deed fraud in hyderabad

బంజారాహిల్స్‌: ఒక నకిలీ విల్‌డీల్‌ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని  వంశీరామ్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థతో  ఎం.కాంతరాజులు వారసులైన ముగ్గురు మహిళలు 2020లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమిని డెవలప్‌మెంట్‌ కోసం బిల్డర్‌కు ఇచ్చారు. 

అయితే ముగ్గురు మహిళలు కుట్రపూరితంగా వ్యవహరించారని ‘వంశీరామ్‌’సంస్థ ప్రతినిధి విశ్వరాజ్‌ మోహన్‌  కోర్టును ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది.  నకిలీ విల్‌డీడ్‌ సృష్టించి  నిజాన్ని దాచి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా 2025 జనవరిలో మూడో వ్యక్తి  కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.  నిందితులు అక్రమంగా లాభపడ్డారని వంశీరామ్‌ బిల్డర్స్‌ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌కుమారి, సద్గుణ, అనురాధ అనే ముగ్గురు మహిళలపై చీటింగ్, పోర్జరీ కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement