సాక్షి, బాసర: గోదావరి నదిలో నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. చంద్రశేఖర్, రామచందర్, మల్లేశ్గా గుర్తించారు. గల్లంతైన వారంతా కాచిగూడ చెప్పల్ బజార్కు చెందిన వారిగా తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


