హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్లుండి(గురువారం) నుంచి ఉచిత బీమా పథకం ప్రారంభించనుంది. సీఎం రేవంత్రెడ్డి ఈ పథకాన్నిరవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు.
సహజ, ప్రమాద మరణాలకు ఈ బీమా వర్తించనుంది. దీనికి సంబంధించి బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సుమారు రూ. 1.20 కోట్ల వరకూ ఉచిత జీవిత బీమా పథకం వర్తింప చేయనున్నారు.


