రాజ్‌భవన్‌లో ప్రధాని రాత్రి బస 

Telangana: Prime Minister Narendra Modi Reached The Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరేడ్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధానిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.

ప్రధాని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసి, సోమవారం ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని విజయవాడ చేరుకుని అటు నుంచి హెలికాప్టర్‌లో భీమవరానికి వెళ్లనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top