
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది