Casino Case: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్‌

Talasani PA Ashok Attend ED Probe Chikoti Praveen Casino Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. మంత్రి తలసాని యాదవ్‌ పీఏ అశోక్‌.. ఇవాళ(సోమవారం) ఈడీ ఎదుట హాజరయ్యాడు. 

ఈ వ్యవహారానికి సంబంధించి.. అశోక్‌ను సుదీర్ఘంగా ఈడీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు చీకోటితో లింకులున్నాయనే కోణంలో తలసాని సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంధర్ యాదవ్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. అలాగే.. ఎమ్మెల్సీ రమణను సైతం విచారించింది.

క్యాసినో కేసుకు సంబంధించి.. ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా పలువురికి ఇదివరకే నోటీసులు జారీ చేసింది ఈడీ. ఆ లిస్ట్‌లో ఉన్న మరికొందరిని త్వరలో ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top