
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డేను పుసర్కరించుకొని ఏర్పాటు చేసిన అల్పాహారం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కింద పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా డే నిర్వహించారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. టోకెన్లు ఉన్న వారు టిఫిన్ కోసం వెళ్లగా అప్పటికే అయిపోయింది. మళ్లీ ట్రాలీ ఆటోలో టిఫిన్ తెప్పించడంతో టోకెన్లు ఉన్న వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజీమా(19) కింద పడిపోయి అస్వస్థతకు గురైంది.
వెంటనే అంబులెన్స్లో కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగిని రెడ్డి ఆమెను పరామర్శించి విషయాలను అడి గి తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్తో పాటు అంబులెన్స్లో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించామని, అక్కడ సీటీ స్కాన్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే తెలిసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని పలువురు విమర్శించారు.