కనుల పండువగా ‘ఆజాదీ కా రేల్‌గాడీ ఔర్‌ స్టేషన్‌’ 

South Central Railway Conduct Azadi Ka Rail Gadi Aur Station Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా దక్షిణమధ్య రైల్వేలో ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా రేల్‌ గాడీ ఔర్‌ స్టేషన్‌’ వేడుకలు  సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  అరుణ్‌కుమార్‌ జైన్, సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా, వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ నెల  23వ తేదీ వరకు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో  ఆజాదీ కా రేల్‌ గాడీ ఔర్‌ స్టేషన్‌  ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్‌ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు  విశేషంగా ఆకట్టుకున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్త్సోత్సవాల స్ఫూర్తిని చాటుతూ కళాకారులు  అద్భుతమైన  కార్యక్రమాలతో అలరించారు.   

(చదవండి: మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్‌ సెల్‌’ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top