తల్లిని ఆర్డీవో ఆఫీసులో వదిలి వెళ్లిన కొడుకులు | Sons Left Mother at RDO Office At Jagtial Telangana | Sakshi
Sakshi News home page

తల్లిని ఆర్డీవో ఆఫీసులో వదిలి వెళ్లిన కొడుకులు

Dec 7 2025 11:00 AM | Updated on Dec 7 2025 12:17 PM

Sons Left Mother at RDO Office At Jagtial Telangana

జగిత్యాల: కని, పెంచిన తల్లి వారికి భారమైంది.. కుమారులు ఆమెను వదిలించుకోవాలను­కున్నారు. దీంతో ఏకంగా ఆర్డీవో కార్యాలయంలోనే తల్లిని వదిలి వెళ్లి­పోయారు. జగిత్యాలలో ఈ ఘటన చోటు­చేసుకుంది. మల్యాల మండలానికి చెందిన కుర్రె లక్ష్మికి ఇద్దరు కుమారులు కృష్ణ, శ్రీనివాస్‌ ఉన్నారు. ఒకరు జగిత్యాలలో.. మరొకరు మల్యాలలో ఉంటున్నారు. లక్ష్మి భర్త నారా­యణ­దాస్‌ గతంలోనే మృతిచెందాడు. 

ఆస్తిపంపకాల్లో గొడవ రావడంతో సమస్య పరి­ష్కారానికి శనివారం ఉదయం తల్లితోపాటు కుమారులు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం తల్లిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కొడుకులు రాకపోవడంతో ఆ వృద్ధురాలు చలిలోనే కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. ఇది గమనించిన ఆర్డీవో వెంటనే ఆమె కొడుకులకు ఫోన్‌ చేసి తల్లిని వెంటనే తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరూ కలిసి తన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తీసుకెళ్లాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement