సికింద్రాబాద్‌లో చిన్నారి కృత్తిక అదృశ్యం.. సిద్ధిపేటలో ఆచూకీ లభ్యం

Six Year Old Girl Missing In Secunderabad Mahankali - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో మరో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహంకాళి పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాకే తమ ఆరేళ్ల పాప కృత్తిక అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించగా..చిన్నారి కృత్తిక ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు చిన్నారి మిస్సింగ్‌ కేసును చేధించారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ పోలీసులు సిద్ధిపేటలో చిన్నారిని గుర్తించారు.  కిడ్నాప్‌ చేసిన పాపను సైకో రాము సిద్ధిపేటకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. 

(చదవండి: గోషామహల్‌లో కుంగిన పెద్ద నాల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top