కరోనా కేసుల్లేవ్‌ | Single Corona Case Not Register In Telangana: Health Director Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కరోనా కేసుల్లేవ్‌

Jan 28 2023 2:39 AM | Updated on Jan 28 2023 2:39 AM

Single Corona Case Not Register In Telangana: Health Director Srinivasa Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారి శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక్క రోజులో 3,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశా రు.

కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రోజూ కేసులు నమోదయ్యే వని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు గరిష్టంగా ఒక రోజులో 15 కేసులు నమోదు కాగా, తాజాగా కనిష్టంగా జీరో కేసులు నమో దయ్యాయని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8.41 కరోనా కేసులు నమోదైనట్లయింది. అందులో 8.37 లక్షల మంది కోలుకున్నా రు. ఒక రోజులో 10,405 మంది కరోనా టీకా వేసుకున్నారు. వారిలో 9,800 మంది బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement