
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెదపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.