Medaram Jathara: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు | PM Modi Wishes Telangana People On Medaram Jathara | Sakshi
Sakshi News home page

మేడారం జాతరపై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్‌

Feb 21 2024 10:11 AM | Updated on Feb 21 2024 1:04 PM

Pm Modi Wishes Telangana People On Medaram Jathara - Sakshi

మేడారం జాతరపై ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు. 

సాక్షి,హైదరాబాద్‌: మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో బుధవారం ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర.  సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర బుధవారం(ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొక్కులు, దర్శనం కోసం భారీగా తరలి వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారనున్నాయి. 24 వరకు ఈ జాతర జరగనుంది. 

ఇదీ చదవండి.. నేటి నుంచి మేడారం జాతర 

Advertisement
 
Advertisement
Advertisement