సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) చంద్రశేఖర్ భార్య హేమలత బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని వారి నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె బలవన్మరణానికి కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.