శెభాష్ దర్శనం మొగిల‌య్య‌.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ' | Padma Shri Award presented to Darshanam Mogilaiah | Sakshi
Sakshi News home page

శెభాష్ దర్శనం మొగిల‌య్య‌.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ'

Jan 25 2022 11:22 PM | Updated on Jan 26 2022 3:43 PM

Padma Shri Award presented to Darshanam Mogilaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2022 సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని ప‌ద్మ అవార్డులు వ‌రించాయి. అందులో మొగిల‌య్య ఒక‌రు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం.. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డ్‌ని ప్రకటించింది.

మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ.. కథలు చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్‌ మొదట్లో కొంత బాగాన్ని పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement