భూమి యాజమాన్య హక్కుల్లో 23 శాతం వాటా
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2025 నివేదిక ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 52.26 శాతంగా ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు.
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వ్యవసాయ గణన 2015–16 నివేదిక ప్రకారం తెలంగాణలో మహిళల పేరిట ఉన్న భూకమతాలు 23.00 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో మహిళా శ్రామిక శక్తి 59.81 శాతం కాగా, భూ యాజమాన్యం 13.96 శాతంగా ఉందన్నారు.


