కాసిపేట: మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ టికెట్ కలెక్షన్ మాత్రం రావడం లేదు. దేవాపూర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సులో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే మగవారు ఉన్నారని, నగదు ఎలా తీసుకురావడం అని ప్రశ్నిస్తూ అధికారులు గమనించి కండక్టర్లపై ఒత్తిడి ఆపివేయాలని కోరారు.
🚌 “బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు!”
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది.
“మా బస్సులో 80 మంది ప్రయాణికులు ఉంటే.. అందులో ఇద్దరే పురుషులు. ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. మేం కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాం.… pic.twitter.com/4jNPtQMozU— Suresh_Journalist (@Suresh_Journo) August 26, 2026
చదవండి: ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు


