ఫోన్‌ ఉన్నా సిగ్నల్స్‌ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే..

Man Stuck In Middle Of Stream Spends Hole Night In Water At kadem Mandal - Sakshi

సాక్షి, నిర్మల్‌: వాగు మధ్య చిక్కుకుపోయిన ఒక యువకుడు ఎట్టకేలకు గ్రామస్తుల సాయంతో క్షేమంగా బయటపడ్డాడు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం మారుమూల అటవీ గ్రామమైన ఇస్లాంపూర్‌కు చెందిన యువకుడు కనక దాము అనే యువకుడు ఈనెల 11న మండలం ఉడుంపూర్‌ గ్రామానికి రేషన్‌ బియ్యం తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు వాగు పొంగడంతో చిక్కుకుపోయాడు.

ఫోన్‌ ఉన్నా సిగ్నల్స్‌ లేకపోవడంతో రాత్రంతా బిక్కుబిక్కు­మంటూ అక్కడే గడిపాడు. మంగళవారం ఉదయం సమీపంలోని చెట్టు ఎక్కి గ్రామస్తు­లకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ కనక పద్మ భర్త జైతు, ఉప సర్పంచ్‌ వామన్, గ్రామస్తులతో కలిసి వాగు వద్దకు వెళ్లారు. తాడు సాయంతో యువకుడిని ఒడ్డుకు క్షేమంగా తీసుకొచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top