ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి | Man Goes Missing After 7 Months Of Love Marriage At Patancheru | Sakshi
Sakshi News home page

ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి

Feb 28 2023 1:03 PM | Updated on Feb 28 2023 2:56 PM

Man Goes Missing After 7 Months Of Love Marriage At Patancheru - Sakshi

సాక్షి, హైదరాబాద్‌, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ ఎస్‌­ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సపూర్‌ మండలం హమీద్‌నగర్‌కు చెందిన ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు.

ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత  తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement