సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరా కేసులో షేక్ ఫైజల్ అనే కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.62 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని కారు సీజ్ చేశారు. కాగా డ్రగ్స్ అమ్మకాల్లో ఫైజల్ కరుగుగట్టిన నేరస్థుడిగా చలామణీ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో డ్రగ్స్ తీసుకొని అదేమత్తులో వేగంగా కారు నడిపి చేయి సైతం పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు.


