ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్‌  | High Court CJ Justice Satish Chandra Sharma Pays Rich Tributes To Dr Ambedkar | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్‌ 

Apr 15 2022 4:00 AM | Updated on Apr 15 2022 3:32 PM

High Court CJ Justice Satish Chandra Sharma Pays Rich Tributes To Dr Ambedkar - Sakshi

అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న  హైకోర్టు  సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర 

సాక్షి, హైదరాబాద్‌: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్‌ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ నందా, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసా ద్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ ప్రసంగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement