సాక్షి, హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి.
విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.


