సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి లోథా అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పై అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.


