Contaminated Water In Mission Bhagiratha At Bhadrachalam - Sakshi
Sakshi News home page

నల్లా తిప్పితే నల్లని నీరు.. భద్రాద్రి వాసుల గోస, మిషన్‌ భగీరథ అధికారుల కీలక ‍ప్రకటన

Jul 19 2022 3:28 PM | Updated on Jul 19 2022 5:20 PM

Contaminated Water In Mission Bhagiratha At Bhadrachalam - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్‌ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్‌ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని  తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్‌ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు.

వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇ‍వ్వాలని అధికారులు పేర్కొన్నారు.


చదవండి: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement