రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్‌

CM KCR Review On Second Installment Sheep Distribution - Sakshi

రెండో విడ‌త గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తెలిపారు. రెండో విడ‌త గొర్రెల పంపిణీపై సీఎం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీష్ రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, అధికారుల‌తో మంగళవారం స‌మీక్ష నిర్వ‌హించారు.రెండో విడత పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు సీఎం వెల్లడించారు. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేప‌ట్టామని పేర్కొన్నారు. కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top