పరకాలలో ఫైరింగ్ కలకలం | Builder Tirupathi Reddy Opened Fire With Licensed Gun | Sakshi
Sakshi News home page

పరకాలలో ఫైరింగ్ కలకలం

Sep 21 2023 7:58 PM | Updated on Sep 22 2023 1:29 PM

Builder Tirupathi Reddy Opened Fire With Licensed Gun - Sakshi

సాక్షి, హన్మకొండ జిల్లా:  పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు.

కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స‍్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్‌ దుర్మరణం

Advertisement
 
Advertisement
Advertisement