సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానికల్ షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల ధాటికి పలు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా, ప్రమాదానికి గత కారణాలు తెలియాల్సి ఉంది.


