ఊపిరి తీసిన ‘ఉపాధి’ | Boulders crush 2 women MGNREGA workers in Siddipet | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన ‘ఉపాధి’

Jan 31 2025 9:02 AM | Updated on Jan 31 2025 9:02 AM

Boulders crush 2 women MGNREGA workers in Siddipet

సాక్షి, హైదరాబాద్‌/హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడటంతో తల్లీకూతురు మృత్యువాతపడ్డారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సారవ్వ (50), అన్నాజీ మమత (32) తల్లీకూతుళ్లు. ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు గ్రామ శివారులోని సంజీవరాయిని గుట్ట వద్ద మట్టి తవ్వకాల పనులకు వెళ్లారు. 

మట్టి బలంగా ఉండటంతో తవ్వడానికి సులువుగా ఉంటుందని పనిచేసే ప్రదేశంలో రాత్రి వేళ నీళ్లను పట్టారు. రోజు మాదిరిగానే పనులు చేస్తుండగా ఒక్కసారిగా దాదాపు 10 బండరాళ్లు నేలకూలాయి. అక్కడే పనిచేస్తున్న సారవ్వ, మమతపై బరువైన బండరాళ్లతో పాటు మట్టి పెళ్లలు పడి భూమిలో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

విచారణకు మంత్రుల ఆదేశం.. 
బండరాళ్లు పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ వేర్వేరుగా తీవ్ర ది్రగ్బాంతిని వ్యక్తం చేశారు. తక్షణం సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ మనుచౌదరితో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో పనులు చేయొద్దని వారం రోజుల క్రితమే జిల్లా అధికారులు హెచ్చరించినా.. పనులు కొనసాగడం పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement