భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్‌ నిరసన | Bhadrachalam Prasadam: Moldy laddus in Bhadradri Ram Temple | Sakshi
Sakshi News home page

భద్రాద్రి: కౌంటర్‌లో బూజు పట్టిన లడ్డూ ప్రసాదం విక్రయం.. భక్తుల కౌంటర్‌ నిరసన

Jan 9 2023 10:07 AM | Updated on Jan 9 2023 10:07 AM

Bhadrachalam Prasadam: Moldy laddus in Bhadradri Ram Temple - Sakshi

ఫైల్‌ ఫొటో

ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు ఇస్తారు అని ఒక పేపర్‌ మీద రాసి కౌంటర్‌కు అతికించారు.. 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్‌ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. 

బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్‌ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్‌ మీద రాసి లడ్డూ కౌంటర్‌కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement