చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో ఓ గర్భిణి 5.5 కిలోల బరువు శిశువుకు జన్మనిచ్చింది. చర్ల గొల్లగట్టకు చెందిన ఎం.డీ.ములాన్బేగంను నాలుగో కాన్పు కోసం కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ఈమేరకు గురువారం రాత్రి ఆమెను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం బాగుండడంతో సాధారణ ప్రసవం చేశారు. ఈ సందర్భంగా 5.5 కిలోల బరువుతో మగబిడ్డ జన్మించగా.. తల్లీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారి హారిక తెలిపారు.


