సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏబీసీ సోదాలు చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో రవీందర్ ఇళ్లతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లు.. 15 చోట్ల సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు.
కాగా, ఇటీవల ‘డీఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.10.12 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు, బ్యాంకు నిల్వలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి సామగ్రి బయటపడిన సంగతి తెలిసిందే. లెక్కకు వచ్చిన ఆదాయం సుమారు రూ.2.10 కోట్లు, అంచనా ఖర్చు రూ.1.03 కోట్లని లెక్కించాం. మిగిలిన పొదుపుతో పోలిస్తే రూ.9.05 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నాయి.
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మణికొండ, పటాన్చెరు, జూబ్లీహిల్స్, అల్వాల్, గచ్చిబౌలి, గడ్డిఅన్నారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. భీమ్రెడ్డి నివాసంతోపాటు ఆయనతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, వాణిజ్య స్థలాలు, బంగారు నగలు, లెక్కలోకి రాని నగదు, బ్యాంకు ఖాతాల వివరాలు దొరికాయి.


