స్నానానికి వెళ్లి కానరానిలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

స్నానానికి వెళ్లి కానరానిలోకాలకు..

Aug 17 2023 2:00 AM | Updated on Aug 17 2023 7:50 AM

మృతి చెందిన విద్యార్థులు (ఫైల్‌)   - Sakshi

మృతి చెందిన విద్యార్థులు (ఫైల్‌)

కొరుక్కుపేట: ఉవారి సమీపంలో సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. వివరాలు.. తిరునేల్వేల్లి జిల్లా వెక్లియన్‌ విలై పక్కనే ఉవారి సమీపంలోని నావ్వాలడికి చెందిన మహాలింగం కుమారుడు ముఖేష్‌ (13), ఇషకియప్పన్‌ కుమారుడు రాహుల్‌ (14) , సెల్వరాజ్‌ కుమారుడు ఆకాష్‌( 14) అక్కడి పాఠశాలలో 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్నారు.

మంగళవారం సెలవుదినం కావడంతో ఈ ముగ్గురు విద్యార్థులు అదే గ్రామానికి చెందిన సెల్వన్‌కుమారుడు ప్రకాష్‌తో కలసి బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇందులో ముగ్గురు సముద్రంలో సరదాగా స్నానాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వచ్చిన సముద్రపు అలలు ముగ్గురు విద్యార్థులను ఈడ్చుకెళ్లాయి. ఇది చూసిన ప్రజలు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న కోస్టల్‌ పోలీసు బృందం, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ముగ్గురికోసం గాలిస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కేకలు వేస్తూ బీచ్‌కు పరుగులు తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. రాత్రి సమయం కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో బుధవారం తెల్లవారు జామున కొడవిలై బీచ్‌లో రెండు మృతదేహాలు, కరికోవిల్‌ బీచ్‌లో మరో మృతదేహం ఒడ్డుకు చేరింది. స్థానిక పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement