భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్, సభ్యులుగా ధరావత్ వీరన్ననాయక్, దాసరి తిరుమలరావు, నకిరేకంటి బాలకృష్ణ, పి.వెంకన్న, గోపగాని పెదవెంకన్న, ఎం.దామోదర్రెడ్డి, ఏ.కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ కరీం, ఉప్పల సత్యనారాయణ, మాడ్గుల నవీన్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో రైతులు ఎదుర్కొనే ప్రతి సమస్యను మాజీ మంత్రి దామోదర్రెడ్డి ఆశీస్సులతో పరిష్కరిస్తామన్నారు. పాలకవర్గ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్రెడ్డి, ఎంపీ రఘువీర్రెడ్డి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.