రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం శ్రీకాకుళం వైపు వెళుతున్న లగేజ్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న ఏడు గేదెలను పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుడా సెక్రటరీ సురేష్కు బదిలీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) సెక్రటరీ ఎల్.సురేష్ను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సరెండర్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఏవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్జేవీ రత్నరాజుకు శ్రీకాకుళం సుడా కార్యాలయం ఏవోగా బాధ్యతలు అప్పగించినప్పటికి తిరిగి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం జీవో ఆర్టీ నెం.895ను విడుదల చేశారు.


