నారు పోసినా నీరు లేకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. వరినారును బతికించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాల జాడలేకపోవడంతో కొన్నిచోట్ల బిందెలతో నారు తడుపుతుండగా మరికొన్ని చోట్ల సుదూర ప్రాంతాల్లోని చెరువుల వద్ద మోటారు పంపులు ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలను తడుపుతున్నారు. జి.సిగడాం, రణస్థలం, ఎచ్చెర్ల, బూర్జ తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. – జి.సిగడాం/బూర్జ
బూర్జ వద్ద ఎండిపోతున్న నారుమడులను ట్యాంకర్లతో
తడుపుతున్న రైతులు
సర్వేశ్వరపురంలో పైపులైన్ ద్వారా తీసుకొచ్చిన నీటితో
పంటను తడుపుతున్న రైతు
గెడ్డకంచరాం–బాతువ గ్రామాల మధ్య వరినారును బతికిస్తున్న రైతులు


