పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Dec 31 2025 8:41 AM | Updated on Dec 31 2025 8:41 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

గార: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం గొంటి పంచాయతీ సచివాలయం వద్ద పర్యావరణ పరిరక్షణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రకృతిని పెంపోందించే కార్యక్రమంలో భాగంగా దీపావళి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్క నాటాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్‌ చల్ల శ్రీనివాసరావు, ఎన్జీవో ఎం.సింహాచలం, వీఆర్‌వో కిరణ్‌, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement