
తెలంగాణ సీఎస్గా ఏపీఆర్ఎస్ పూర్వ విద్యార్థి
పరిగి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లి పూర్వ విద్యార్థి కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రామకృష్ణారావు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ గుత్తి కోటలోని 8వ వార్డు స్కూల్లో చదువుకున్నారు. అనంతరం కొడగినహళ్లి ఏపీఆర్ఎస్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం సాగించారు. అనంతరం నాగార్జున సాగర్లో ఇంటర్, కాన్పూర్ ఐఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, డ్యూక్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ (హైదరాబాద్)లో సెటిల్ అయ్యారు. తెలంగాణ ఆర్థిక కార్యదర్శిగా కూడా పని చేశాడు. రామకృష్ణారావు తెలంగాణ సీఎస్గా ఎంపిక కావడంతో ఏపీఆర్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ బాబు, ఉపాధ్యాయ బృందం, పూర్వవిద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండటం తమకెంతో గర్వకారణమన్నారు.