స్నేహితుడి భార్యను కాపాడబోయి.. | - | Sakshi
Sakshi News home page
breaking news

స్నేహితుడి భార్యను కాపాడబోయి..

Sep 12 2023 12:22 AM | Updated on Sep 12 2023 7:43 AM

- - Sakshi

అనంతపురం సిటీ: రైలు కిందపడబోతున్న స్నేహితుడి భార్యను కాపాడబోయి ఓ మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఆవాజ్‌పూర్‌కు చెందిన రక్షపాల్‌ (34), తన స్నేహితుడు మున్నాకుమార్‌, అతని భార్య హీరామతితో కలసి రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న సిమెంట్‌ ఇటుకల ఫ్యాక్టరీలో దిన కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌కు మున్నాకుమార్‌, హీరామతి దంపతులను రైలు ఎక్కించేందుకు తోడుగా రక్షపాల్‌ అనంతపురంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు రైలు స్టేషన్‌కు చేరుకోగానే బోగిని వెతుక్కొని మున్నాకుమార్‌ ఎక్కేలోపే రైలు ముందుకు కదిలింది.

ఆ సమయంలో హీరామతి రైలు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రక్షపాల్‌ కూడా రైలు–ప్లాట్‌ ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయాడు. బోగిలోని చైన్‌ను మున్నాకుమార్‌ లాగడంతో రైలు కొద్ది దూరం వెళ్లి ఆగింది. అప్పటికే హీరామతి కుడి పాదం తెగిపడింది. రక్షపాల్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు.

చికిత్స అందేలోపు రక్షపాల్‌ మృతి చెందాడు. హీరామతిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. రక్షపాల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement