వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని యేల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల (వైఆర్జేసీ)ను ప్రారంభించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పూర్వవిద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోల్డెన్జూబ్లీ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు ముందస్తుగా సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వర్ణోత్సవ వేడుకలకు పూర్వవిద్యార్థులందరూ హాజరై విజయవంతం చేయాలని కరస్పాడెంట్ రాజా పవన్కుమార్, ప్రిన్సిపల్ పద్మనాభయ్య, కమిటీ అధ్యక్షుడు కే వెంకటరమణ కోరారు.


